|

2nd Year History 2 Marks TM

2 Marks 

  1. శాతవాహనుల ఏవైనా రెండు శాసనాలను పేర్కొనండి

శాతవాహనుల శాసనాలలో ముఖ్యమైనవి “నానేఘాట్ శాసనం” మరియు “నాసిక్ శాసనం”. నానేఘాట్ శాసనం ద్వారా శాతకర్ణి విజయాలు తెలుస్తాయి; నాసిక్ శాసనం ద్వారా గౌతమీపుత్ర శాతకర్ణి ఘనత తెలుస్తుంది.

  1. విష్ణుకుండినుల పాలకులలోని ఎవరైనా ఇద్దరి పాలకుల పేర్లు పేర్కొనండి.

విష్ణుకుండినుల పాలకులలో మాధవవర్ముడు – I మరియు మంచన భట్టారకుడు ముఖ్యులు. మాధవవర్ముడు విష్ణుకుండిన వంశ స్థాపకుడు కాగా, మంచన భట్టారకుడు చివరి పాలకుడు.

  1. త్రిలింగ దేశం

త్రిలింగ దేశం (Trilinga Desa) అనేది ఆంధ్రదేశానికి మరో పేరు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు శైవక్షేత్రాలలో ఉన్న మూడు లింగాల ఆధారంగా ఆంధ్రదేశానికి ”త్రిలింగభూమి” లేదా ”త్రిలింగదేశం” అనే పేరు వచ్చింది.

  1. చాళుక్య భీముడు

చాళుక్య భీముడు (సా.శ. 892–921) తూర్పు చాళుక్య వంశానికి చెందిన ముఖ్య పాలకుడు. ఇతడు “చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని” నిర్మించాడు. ఈ ఆలయం ఆంధ్రదేశంలోని పంచారామాలలో ఒకటైన భీమవరం లో ఉంది. ఇతడు సంస్కృత కవులను, సంగీతకారులను కూడా ప్రోత్సహించాడు.

  1. నృత్య రత్నావళి

నృత్య రత్నావళి గ్రంథాన్ని జయప సేనాని రచించాడు. ఇది కాకతీయుల కాలంలోని నృత్యం, సంగీతం, వివిధ నృత్యరీతులు మరియు వాద్య పరికరాల గురించి వివరించే ముఖ్యమైన సంస్కృత గ్రంథం.

    6 . సాళువ తిమ్మరుసు

సాళువ తిమ్మరుసు విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయల ప్రధాన మంత్రి (మహాప్రధాన) మరియు సైనిక కమాండర్. ఆయనను “అప్పాజీ” అని కూడా అంటారు. తిమ్మరుసు తెలివైన రాజనీతిజ్ఞుడు, సమర్థ పరిపాలకుడు. ఆయన సలహాలతో శ్రీకృష్ణదేవరాయలు అనేక విజయాలు సాధించాడు.

    7 . అముక్తమాల్యద

అముక్తమాల్యద విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రసిద్ధ తెలుగు ప్రబంధం. ఇందులో ఆండాళ్‌ (గోదాదేవి) – శ్రీరంగనాథుని భక్తి కథ వర్ణించబడింది. ఇది తెలుగు సాహిత్యంలో అత్యుత్తమ గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

  1. వీరబ్రహ్మేంద్ర స్వామి

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాకు చెందిన ప్రముఖ భక్తి సంత్‌, తత్వవేత్త. ఆయన అన్ని కులాల వారినీ తన శిష్యులుగా స్వీకరించాడు. ‘కాలజ్ఞానం’ అనే ప్రవచన గ్రంథాన్ని రచించాడు. ఆయన బోధనలు సమానత్వం, భక్తి మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించాయి.

  1. చందుర్తి యుద్ధం (1758)

చందుర్తి యుద్ధం (1758) డిసెంబర్ 7, 1758న రాజమండ్రి సమీపంలోని చందుర్తి వద్ద జరిగింది. ఈ యుద్ధం కల్నల్ ఫోర్డ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు మరియు ఫ్రెంచ్ సేనల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఓడిపోయారు. దీని ఫలితంగా ఉత్తర సర్కారులపై ఫ్రెంచ్ ఆధిపత్యం ముగిసి, ఆంధ్రలో బ్రిటిష్ పాలనకు పునాది పడింది.

  1. నీలి నీటి విధానం (Blue Water Policy)

బ్లూ వాటర్ పాలసీ” విధానాన్ని పోర్చుగీసు ప్రతినిధి ‘ ఫ్రాన్సిస్కో డి అల్మీడా’ అమలు చేశాడు. ఈ విధానం ప్రకారం సముద్ర మార్గాలపై ఆధిపత్యం సాధించడానికి బలమైన నౌకాదళాన్ని నిర్మించడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా పోర్చుగీసు వారు భారత మహాసముద్ర వాణిజ్యంపై ఏకాధిపత్యం సాధించడానికి ప్రయత్నించారు.

  1. థామస్ మున్రో

థామస్ మున్రో బ్రిటిష్ పాలన కాలంలోని ప్రముఖ అధికారి. ఆయన 1800 CE లో దత్తమండలాల (రాయలసీమ) మొదటి కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. రైతులతో ప్రభుత్వానికి నేరుగా సంబంధం ఉండే రైత్వారీ (Ryotwari) విధానాన్ని 1802 CE లో ప్రవేశపెట్టాడు.

  1. కండ్రేగుల జోగి పంతులు

కండ్రేగుల జోగి పంతులు బ్రిటిష్ వారికి సహాయం చేసిన “ప్రముఖ అనువాదకుడు” (Interpreter). ఆయన సహాయంతో బ్రిటిష్ వారు నిజాం అలీ ఖాన్ నుండి ఉత్తర సర్కారులపై హక్కులను పొందగలిగారు. ఉత్తర సర్కారుల స్వాధీనంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు.

  1. విజ్ఞాన చంద్రికా మండలి

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు 1906లో “విజ్ఞాన చంద్రికా మండలి” ని స్థాపించారు. దీని ద్వారా చరిత్ర, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులో ప్రచురించి ఆంధ్రులలో విజ్ఞానము, చరిత్ర పట్ల  ఆసక్తిని పెంపొందించారు.

  1. కన్నెగంటి హనుమంతు

కన్నెగంటి హనుమంతు పల్నాడు అటవీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన స్వాతంత్ర్య సమరయోధుడు. అటవీ పన్నులకు (పుల్లరి) వ్యతిరేకంగా గిరిజనులు, రైతులను సమీకరించి పోరాడాడు. ఈ ఉద్యమంలో బ్రిటిష్ పోలీసులు ఆయనను కాల్చి చంపారు.

  1. మార్క్ హంటర్

మార్క్ హంటర్ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్. వందేమాతరం ఉద్యమ సమయంలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు నాయకత్వంలో విద్యార్థులు “వందేమాతరం” బ్యాడ్జీలు ధరించి కళాశాలకు రావడంతో, మార్క్ హంటర్ వారిని కళాశాల నుండి బహిష్కరించాడు. ఈ సంఘటనను “రాజమండ్రి కళాశాల సంఘటన” అని అంటారు.

  1. ఆంధ్ర మహాసభ (Andhra Mahasabha).

ఆంధ్రుల హక్కులు, భాషా అభివృద్ధి మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 మే 20న బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ జరిగింది. దీనికి బి.ఎన్. శర్మ అధ్యక్షత వహించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఇది ముఖ్యమైన పునాది వేసింది.

  1. కృష్ణా పత్రిక

కృష్ణా పత్రిక తెలుగు భాషలో వెలువడిన ప్రముఖ జాతీయవాద వార్తాపత్రిక. ఇది తెలుగు ప్రజల్లో జాతీయ భావాలు, రాజకీయ చైతన్యం, స్వదేశీ భావన మరియు ఆంధ్ర ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది, “ఆంధ్ర ఉద్యమానికి బలాన్ని” చేకూర్చింది.

  1. పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయనే “విశాలాంధ్ర” అనే భావనను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి, ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల ఐక్యతకు కృషి చేశారు. ఆయన రచించిన “ప్రజారాజ్యం ఇన్ విశాలాంధ్ర” అనే  గ్రంథం విశాలాంధ్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చింది.

  1. శ్రీకృష్ణ కమిషన్

శ్రీకృష్ణ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3 న ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యను పరిశీలించడానికి ఏర్పాటు చేసింది. దీనికి న్యాయమూర్తి బి.ఎన్. శ్రీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కమిషన్ తెలంగాణ–సమైక్యాంధ్ర సమస్యపై అధ్యయనం చేసి, 2010 డిసెంబర్ 30న తన నివేదికను సమర్పించింది.

  1. కొండా రెడ్డి బురుజు అనే పేరు ఎలా వచ్చింది?

కొండా రెడ్డి బురుజు అనే పేరు ఆలంపూర్ పాలకుడు కొండా రెడ్డి పేరుమీద వచ్చింది. అతనిని కర్నూలు నవాబు ఈ కోటలో బంధించాడు. కథనాల ప్రకారం, అతను అక్కడి నుండి ఒక సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్నాడు. అందువల్ల ఈ బురుజుకు కొండా రెడ్డి బురుజుఅనే పేరు వచ్చింది.

  1. హార్స్లీ హిల్స్

హార్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్‌. దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని 1870 CE లో W.D. Horsley అనే యూరోపియన్ అధికారి అభివృద్ధి చేశాడు. ఇక్కడి చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

  1. ఆంధ్రప్రదేశ్‌లోని ఏవైనా రెండు సముద్ర తీరాల (బీచ్‌ల) పేర్లు చెప్పండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ బీచ్‌లలో ఏవైనా రెండు:

  • రామకృష్ణ బీచ్ (విశాఖపట్నం)
  • సూర్యలంక / బాపట్ల బీచ్

23. ఆంధ్రప్రదేశ్‌లోని ఏవైనా రెండు పర్యావరణ మరియు సాహస పర్యాటక ప్రాంతాలను పేర్కొనండి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఎకో మరియు అడ్వెంచర్ పర్యాటక కేంద్రాలలో ప్రధానమైన రెండు ప్రాంతాలు:

1.అరకు వ్యాలీ (Araku Valley)

  1. బొర్రా గుహలు (Borra Caves)

ఈ ప్రాంతాలు తమ ప్రకృతి సౌందర్యం, ట్రెక్కింగ్‌, సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందాయి.

  1. కోటప్పకొండ ఆలయ తిరునాళ్లు

కొటప్పకొండ దేవాలయ జాతర గుంటూరు జిల్లాలోని కొటప్పకొండ కొండ పై ఉన్న శివాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా జరుగుతుంది. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ 60–70 అడుగుల ఎత్తైన “ప్రభలు”. రంగురంగుల అలంకరణలతో జరిగే ఈ ఉత్సవం భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.

  1. హోమో సేపియన్స్

హోమో సేపియన్స్ అంటే “జ్ఞానవంతుడైన మనిషి” (Wise Man) అని అర్థం. వీరే ఆధునిక మానవులు. వీరికి బాగా అభివృద్ధి చెందిన మెదడు, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యం మరియు సామాజిక జీవనం వంటి లక్షణాలు ఉన్నాయి.

  1. గిల్గమేష్ ఇతిహాసం

గిల్గమేష్ ఇతిహాసం ప్రాచీన మెసపొటేమియా నాగరికతకు చెందిన ప్రసిద్ధ కావ్యం. ఇది ఉరుక్ రాజు గిల్గమేష్ జీవితాన్ని, అతని సాహసాలను మరియు అమరత్వం కోసం చేసిన అన్వేషణను వివరిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ఇతిహాసాలలో ఇది ఒకటిగా గుర్తించబడింది.

  1. గిజా పిరమిడ్

గిజా పిరమిడ్ ప్రాచీన ఈజిప్టు లోని అత్యంత ప్రసిద్ధ పిరమిడ్. ఇది ఈజిప్టు రాజు ఫారో ఖుఫు (Khufu) సమాధిగా నిర్మించబడింది. ప్రపంచంలోని ఏడు ప్రాచీన అద్భుతాలలో ఇప్పటికీ నిలిచి ఉన్న ఏకైక అద్భుతంగా గిజా పిరమిడ్ ప్రసిద్ధి చెందింది.

  1. ప్రాచీన గ్రీస్‌కు చెందిన ఏవైనా ఇద్దరు తత్వవేత్తల పేర్లను పేర్కొనండి

ప్రాచీన గ్రీస్‌కు చెందిన అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు తత్వవేత్తలు “సోక్రటీస్” మరియు అతని శిష్యుడు “ప్లేటో”.

  1. ఇస్లామిక్ క్యాలెండర్

ఇస్లామిక్ క్యాలెండర్‌ను హిజ్రీ క్యాలెండర్ అని కూడా అంటారు. ప్రవక్త మహమ్మద్ గారు సా.శ. 622లో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లిన సంఘటన (హిజ్రా) నుండి ఈ కాలగణన ప్రారంభమైంది. ఇది చంద్ర ఆధారిత (Lunar) క్యాలెండర్ కాగా, సంవత్సరాలను AH (Anno Hegirae) అని సూచిస్తారు.

  1. క్రూసేడ్లు (మత యుద్ధాలు)

క్రూసేడ్లు అనేవి సా.శ. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య జరిగిన మత యుద్ధాలు. జెరూసలేం (పవిత్ర భూమి) ను ముస్లింల ఆధీనంలో నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ యుద్ధాలు జరిగాయి.

  1. మఠం (Monastery)

మఠం (Monastery) అనేది క్రైస్తవ సన్యాసులు (Monks) నివసిస్తూ ప్రార్థన, అధ్యయనం మరియు శ్రమ చేస్తూ గడిపే మతపరమైన సంస్థ. మఠాలు విద్య, వైద్యం మరియు కళల అభివృద్ధికి ముఖ్యమైన సేవలు అందించాయి.

  1. క్రిస్టోఫర్ కొలంబస్

క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీకి చెందిన సముద్రయాత్రికుడు. ఆయన యాత్రల వల్ల అమెరికా ఖండం యూరోపియన్లకు పరిచయమై, భౌగోళిక ఆవిష్కరణల యుగానికి మార్గం సుగమమైంది.

  1. మైఖేలాంజెలో

మైఖేలాంజెలో ఇటలీకి చెందిన ప్రముఖ శిల్పి, చిత్రకారుడు, వాస్తు శిల్పి మరియు కవి. ఆయన పునరుజ్జీవన యుగం లో అత్యంత గొప్ప కళాకారుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన రూపొందించిన డేవిడ్ విగ్రహం, పియేటా శిల్పం మరియు సిస్టిన్ చాపెల్  పై చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.

  1. లియోనార్డో డావిన్సీ

లియోనార్డో డావిన్సీ ఇటలీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు పునరుజ్జీవన యుగంలోని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వేసిన మోనాలిసా  మరియు ది లాస్ట్ సప్పర్  చిత్రాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.

  1. జాన్ కాల్విన్

జాన్ కాల్విన్ ఫ్రాన్స్‌ కు చెందిన ప్రముఖ మత సంస్కర్త మరియు ప్రొటెస్టంట్ ఉద్యమ నాయకుడు. ఆయన క్రైస్తవ మతంలో సంస్కరణలు తీసుకురావాలని భావించి కాల్వినిజం (Calvinism) అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఆయన ఆలోచనలు యూరప్‌లో మత సంస్కరణ ఉద్యమానికి బలమైన పునాది వేశాయి.

  1. బోస్టన్ టీ పార్టీ

బోస్టన్ టీ పార్టీ 1773 డిసెంబర్ 16న అమెరికాలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన  తేయాకు పై పన్ను (టీ పన్ను ) కు నిరసనగా అమెరికా నిరసనకారులు (వలసవాసులు)  బ్రిటిష్ నౌకలలో ఉన్న 342 తేయాకు పెట్టెలను బోస్టన్ నౌకాశ్రయంలో పడవేశారు. ఈ సంఘటనే  “బోస్టన్ టీ పార్టీ”  గా ప్రసిద్ది చెందింది. ఈ సంఘట అమెరికా స్వాతంత్ర్య సమరానికి ముఖ్య కారణంగా మారింది.

  1. రక్తసిక్త ఆదివారం (Bloody Sunday)

రక్తసిక్త ఆదివారం 1905 జనవరి 22న రష్యాలో జరిగింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజల పై సైన్యం కాల్పులు జరపడంతో అనేక మంది మరణించారు. ఈ సంఘటనను “రక్తసిక్త ఆదివారం” (Bloody Sunday) అని పిలుస్తారు. ఇది రష్యా విప్లవానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది.

  1. సన్ యాట్-సేన్

సన్ యాట్-సేన్ చైనా విప్లవ నాయకుడు మరియు ఆధునిక చైనా పితామహుడు గా ప్రసిద్ధి చెందాడు. ఆయన నాయకత్వంలో 1912లో మంచు వంశ పాలనకు ముగింపు పలికి చైనాను గణతంత్ర దేశంగా మార్చారు.

  1. యంగ్ ఇటలీ (Young Italy)

యంగ్ ఇటలీ అనేది 1831లో జ్యూసెప్పే మజ్జిని (Giuseppe Mazzini) స్థాపించిన ఒక రహస్య జాతీయవాద సంస్థ. దీని ప్రధాన లక్ష్యం ఐక్య ఇటలీ దేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ సంస్థ యువతలో దేశభక్తిని పెంపొందించి, ఇటలీ ఏకీకరణ ఉద్యమానికి బలమైన పునాది వేసింది.

  1. ఏమ్స్ టెలిగ్రామ్ ( EMS టెలిగ్రామ్)

EMS టెలిగ్రామ్ అనేది 1870లో ఒట్టో వాన్ బిస్మార్క్ ఉపయోగించిన ఒక రాజకీయ వ్యూహం. ప్రష్యా రాజు విలియం-I మరియు ఫ్రాన్స్ రాయబారి మధ్య జరిగిన సంభాషణను బిస్మార్క్ మార్చి ప్రచురించాడు. దీనివల్ల ఫ్రాన్స్ అవమానించబడినట్లు భావించి ప్రష్యాపై యుద్ధం ప్రకటించింది. ఈ సంఘటన జర్మనీ ఏకీకరణకు దారితీసింది.

  1. క్రిమియా యుద్ధం

క్రిమియా యుద్ధం1854–1856 మధ్య రష్యా మరియు బ్రిటన్, ఫ్రాన్స్, ఒట్టోమన్ సామ్రాజ్యం మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఇటలీ నాయకుడు Camillo di Cavour (కామిల్లో డి కావూర్) బ్రిటన్, ఫ్రాన్స్‌కు మద్దతు ఇవ్వడం వల్ల తరువాత ఇటలీ ఏకీకరణకు అంతర్జాతీయ సహాయం పొందడానికి అవకాశం కలిగింది.

  1. జోల్వెరిన్ (Zollverein)

జోల్వెరిన్ అనేది జర్మన్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన స్వేచ్ఛా వాణిజ్య సంఘం (Free Trade Union). దీని ద్వారా జర్మన్ రాష్ట్రాల మధ్య అంతర్గత పన్నులు, సుంకాలు తొలగించబడి, వాణిజ్యం అభివృద్ధి చెందింది. ఇది జర్మనీ ఆర్థిక ఐక్యతకు మరియు తరువాత జర్మనీ ఏకీకరణకు పునాది వేసింది.

  1. ట్రిపుల్ ఏంటేటి (Triple Entente)

ట్రిపుల్ ఎంటెంటే అనేది 1907లో ఏర్పడిన ఒక సైనిక ఒప్పందం. ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఒక దేశంపై దాడి జరిగితే పరస్పరం సంప్రదించి సహాయం చేసుకోవడానికి ఏర్పడింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ముఖ్య కారణాలలో ఒకటి.

  1. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన

ఐక్యరాజ్యసమితి United Nations 1948, డిసెంబర్ 10న ఫ్రాన్స్‌ లోని పారీస్ లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (UDHR) ను ఆమోదించింది. దీని ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, విద్య, జీవించే హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులు కలవు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10ను మానవ హక్కుల దినోత్సవం గా జరుపుకుంటారు.

  1. పెర్ల్ హార్బర్ సంఘటన

పెర్ల్ హార్బర్ సంఘటన (Attack on Pearl Harbor) 1941, డిసెంబర్ 7న జరిగింది. జపాన్ దేశం అమెరికాలో ని హవాయి (Hawaii)  ద్వీపంలో ఉన్న పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరంపై ఆకస్మికంగా దాడి చేసింది. ఈ దాడి వల్ల అమెరికాకు భారీ నష్టం జరిగింది. దీని ఫలితంగా అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రవేశించింది.

  1. ప్రచ్ఛన్న యుద్ధం (Cold War)

ప్రచ్ఛన్న యుద్ధం అనేది Cold War రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా (USA) మరియు సోవియట్ యూనియన్ (USSR) మధ్య, సుమారు 1945 నుండి 1991 వరకు కొనసాగింది. ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పోరాటం జరగలేదు, కానీ రెండు దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి పోటీ పడ్డాయి. అందుకే దీనిని “ప్రచ్ఛన్న యుద్ధం” అని పిలుస్తారు.

2y 2marks Tm  Page 12y 2marks Tm  Page 22y 2marks Tm  Page 3

2y 2marks Tm  Page 4

2y 2marks Tm  Page 52y 2marks Tm  Page 62y 2marks Tm  Page 7

Click below link to download the pdf file

2Y 2Marks TM

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *